Homeటాప్ స్టోరీస్రేణూ దేశాయ్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

రేణూ దేశాయ్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

రేణూ దేశాయ్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌!
రేణూ దేశాయ్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాల‌తో స్పీడు పెంచిన విష‌యం తెలిసిందే. ఒక్కో సినిమాకి పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాట‌లు మాత్ర‌మే తీసుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు గాను ఆయ‌న‌కు భారీ మొత్త‌మే అందబోతోంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇదిలా వుంటే రెండేళ్ల విరామం త‌రువాత‌ మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చి షాకుల మీద షాకులిస్తున్న ప‌వర్‌స్టార్ తాజాగా రేణూ దేశాయ్ పిల్ల‌ల కోసం కాస్ట్‌లీ గిఫ్ట్‌ని ఇచ్చార‌ని ప్ర‌చారం మొద‌లైంది.

ఔట‌ర్ రింగ్ రోడ్ కు స‌మీపంలోని జ‌య‌భేరి క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌లో అత్యంత విలాస‌వంత‌మైన ఓ ఫ్లాట్‌ని ప‌వ‌న్ ఖ‌రీదు చేశార‌ని. దీని విలువ 5 కోట్లు వుంటుంద‌ని గ‌త రెండు మూడు రోజులుగా ఓ వార్త ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై రేణు దేశాయ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటుగా స్పందించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌ను త‌న జీవిత మ‌నుగ‌డ కోసం ఒంట‌రిగా శ్ర‌మిస్తున్నాన‌ని, తాను ఇప్ప‌టి వ‌ర‌కు త‌న తండ్రి ద‌గ్గ‌రి నుంచి కూడా ఎలాంటి స‌హాయాన్ని ఆశించ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.

- Advertisement -

త‌న మాజీ భ‌ర్త ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించి వివ‌రిస్తూ .. త‌న వ‌ద్ద నుంచి కూడా త‌ను ఎలాంటి ఆర్థిక స‌హాయాన్ని పొంద‌లేద‌ని, అన్యాయ ప‌ర‌మైన భ‌ర‌ణాన్ని ఆయ‌న నుంచి ఆశించ‌లేద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు పొంద‌లేద‌ని, హైద‌రాబాద్‌లో తాను ఖ‌రీదు చేసిన ఫ్లాట్ త‌న సొంత డ‌బ్బులతో కొన్న‌దే కానీ అందులో ఎవ‌రిచ్చిన డ‌బ్బులు లేవని, ఒంట‌రి త‌ల్లి బాధ‌ని మీడియా ఇప్ప‌టికైనా అర్థం చేసుకోవాల‌ని, ఇలాంటి వార్త‌లు విన్న‌ప్పుడు నా ఆత్మ ఎంత ఘోషిస్తుందో అర్థం చేసుకోవాల‌ని విన్న‌వించడం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All