ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ స్టార్ హీరో పవన్కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారా? అంటే ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. విభిన్న చిత్రాలతో వరుస విజయాల్నిసాధిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు అడివి శేష్. `ఎవరు` చిత్రం తరువాత అడివి శేష్ నటిస్తున్న చిత్రం `మేజర్`. సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి ప్రిన్స్ మహేష్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
`గూఢచారి` ఫేమ్ శిశికిరణ్ తిక్క ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విధి నిర్వహణలో మేజర్ ఉన్నికృష్ణన్ మృతి చెందారు. ఆయన జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్తో 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. కరోనా వైరస్ కారణంగా గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ని తాత్కాలికంగా ఆపేశారు. పరిస్థితులని బట్టి మళ్లీ షూటింగ్ ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
తాజాగా ఈ చిత్రంలోని ఓ పవర్ఫుల్ అతిధి పాత్ర కోసం రేణుదేశాయ్ ని చిత్ర బృందం అనుకుంటోందట. ఇప్పటికే ఆమెని సంప్రదించారని కూడా వార్లు వినిపిస్తున్నాయి. అడివి శేష్, రేణు దేశాయ్ తనయుడు అకీరాతో సన్నిహితంగా వుంటున్నారు. ఆ చనువుతో రేణు దేశాయ్ని ఈ సినిమా కోసం అడివి శేష్ సంప్రదించారట. దీనికి ప్రిన్స్ మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. రేణుదేశాయ్ నుంచి రిప్లై రావాల్సి వుంది. పాత్ర నిడివి తక్కువే అయినా సినిమాలో రేణుదేశాయ్ పాత్ర పవర్ఫుల్గా వుంటుందని చెబుతున్నారు.