స్టార్ హీరోల చిత్రాల్లో ఐటమ్ గీతం వుందంటే ఆ పాట థియేటర్లలో చేసే రచ్చ మామూలుగా వుండదు. అందుకే స్టార్ హీరోలు, దర్శకులు ఈ పాట కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఎంత ఖర్చు అయినా ఫరవాలేదని క్రేజీ భామల్ని ఐటమ్ సాంగ్స్ కోసం దించేస్తుంటారు. కోట్లకు కోట్లు పారితోషికాలు ఇచ్చేస్తుంటారు. ఇక మెగాస్టార్ చిరు సినిమాల్లో అయితే ఇలాంటి గీతాలకు ప్రత్యేక స్థానం వుంది. ఇటీవల ఆయన నటించిన ఖైదీ నంబర్ 150`లో రాయ్ లక్ష్మీపై చిత్రీకరించిన `రత్తాలు రత్తాలు ..` పాట ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం కోసం ఓ ప్రత్యేక గీతాన్ని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. `సైరా నరసింహారెడ్డి` చిత్రం తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిపిందే. విజయదశమి సందర్భంగా ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిరంజన్రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి దేవాదాయ శాఖ అధికారిగా కనిపించబోతున్నారు.
ఇందులో ఓ స్పెషల్ సాంగ్ని చిత్రీకరించాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేశారట. ఈ పాట కోసం క్రేజీ లేడీ రెజీనాను సంప్రదించి భారీ ఆఫర్ ఇచ్చారట, ఆఫర్ నచ్చడం, కెరీర్లో తొలి ఐటమ్ సాంగ్ కావడం, అదీ చిరుతో కావడంతో రెజీనా వెంటనే ఓకే చెప్పినట్టు ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ కోసం మణిఠశర్మ అదిరిపోయే ట్యూన్స్ని రెడీ చేశారని చెబుతున్నారు. త్వరలోనే ఈ పాటని చిత్రీకరిస్తారని, ఈ పాట సినిమాకు ఓ హైలైట్గా నిలిచే అవకాశం వుందని తెలిసింది. ఇందులో హీరోయిన్గా కూడా త్రిషను కన్ఫమ్ చేసినట్టు సమాచారం.