Homeగాసిప్స్ప్రభాస్20 అప్డేట్స్ రాకపోవడానికి కారణం అదేనా?

ప్రభాస్20 అప్డేట్స్ రాకపోవడానికి కారణం అదేనా?

ప్రభాస్20 అప్డేట్స్ రాకపోవడానికి కారణం అదేనా?
ప్రభాస్20 అప్డేట్స్ రాకపోవడానికి కారణం అదేనా?

స్టార్ హీరోల సినిమాలు చేయడంలో ఎన్ని సౌలభ్యాలు ఉంటాయో అన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆ హీరో ఫ్యాన్స్ ను సంతృప్తి పరుస్తూ సినిమా తెరకెక్కించి తిరిగి వారి అంచనాలను అందుకోవడం అంటే కత్తి మీద సామే. ప్రస్తుతం ప్రభాస్ అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నాడు. ఎంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా కానీ ఒక్కో సినిమాకు రెండేళ్లు గ్యాప్ వస్తోంది ప్రభాస్ కు. షూటింగ్ లో డిలే, వివిధ కారణాలతో షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ రెండేళ్ల గ్యాప్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కు అప్డేట్స్ ఇస్తూ రావడం ప్రొడక్షన్స్ హౌస్ లకు తలకు మించిన భారమే అవుతోంది.

బాహుబలి తర్వాత చేసిన రెండు సినిమాలకూ యూవీ క్రియేషన్స్ సంస్థ డబ్బులు పెట్టింది. సాహో సినిమా విషయంలో సరైన సమయానికి అప్డేట్స్ ఇవ్వలేదని అప్పట్లో ఫ్యాన్స్ ఎంతలా యూవీ సంస్థపై ఫైర్ అయ్యారో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే సంస్థ మళ్ళీ ప్రభాస్20 చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఓ డియర్ లేదా రాధే శ్యామ్ అనే టైటిల్స్ ను పరిగణిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకూ రెండు, మూడు వర్కింగ్ స్టిల్స్ తప్ప ఏ విధమైన అప్డేట్స్ లేకుండా పోయాయి. దీని వల్ల మళ్ళీ యూవీ క్రియేషన్స్ సంస్థను ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ నిర్మాణ సంస్థను బ్యాన్ చేసేయాలని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.

- Advertisement -

అయితే యూవీ క్రియేషన్స్ ఏ విధమైన అప్డేట్ ఇవ్వకపోవడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు 75 శాతం పూర్తైపోయినా ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్స్ తో కలుపుకుని పలు ఆసక్తికరమైన సీన్స్ ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. ఇవి కాకుండా  మెటీరియల్ గా ఏ సీన్స్ వాడుకున్నా స్టోరీ తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం లాక్ డౌన్ పూర్తయ్యేదాకా వేచి చూడాలని యూవీ క్రియేషన్స్ సంస్థ భావిస్తోంది. అదీ విషయం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All