క్రాక్ చిత్రంతో తిరిగి పవర్ఫుల్ గా బౌన్స్ బ్యాక్ అయిన మాస్ మహారాజా రవితేజ నుండి వస్తోన్న నెక్స్ట్ చిత్రం ఖిలాడీ. రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాది సమ్మర్ లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం మెజారిటీ భాగం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక సాంగ్స్ ను పూర్తి చేయాల్సి ఉంది.
క్రాక్ లో హీరోయిన్స్ గా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. రవితేజతో పాటు ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. అక్కడ అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరుగుతోంది. వీరు ముగ్గురిపై ఒక పాటను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు. ఈ పాట షూటింగ్ మరికొన్ని రోజుల పాటు దుబాయ్ లో సాగనుంది. ఖిలాడీ షార్ట్ గ్లిమ్ప్స్ కు రెస్పాన్స్ బాగానే వచ్చింది.
ఇక ఖిలాడీ కాకుండా మాస్ మహారాజా వరస సినిమాలను లైనప్ లో పెట్టాడు. కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తోన్న రామారావు ఆన్ డ్యూటీ చేస్తోన్న రవితేజ, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు. ధమాకా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసాక ఖిలాడీ సాంగ్ షూట్ కోసం దుబాయ్ వెళ్ళాడు రవితేజ.