Homeటాప్ స్టోరీస్మాస్ మ‌హారాజా ఇట‌లీ షూట్ ఫినిష్‌!

మాస్ మ‌హారాజా ఇట‌లీ షూట్ ఫినిష్‌!

మాస్ మ‌హారాజా ఇట‌లీ షూట్ ఫినిష్‌!
మాస్ మ‌హారాజా ఇట‌లీ షూట్ ఫినిష్‌!

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం `ఖిలాడీ`. ర‌మేష్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే `క్రాక్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చేసిన ర‌వితేజ `ఖిలాడీ` షూటింగ్‌ని పరుగులు పెట్టించేస్తున్నారు. కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాత జ‌యంతిలాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షీ చౌద‌రి, డింపుల్ హ‌యాతీ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ గ‌త కొన్ని రోజులుగా ఇట‌లీలో జ‌రుగుతోంది. అక్క‌డ వీధుల్లో మాస్ రాజ్ పై ప‌లు ఛేజింగ్ స‌న్నివేశాల‌తో పాటు కీల‌క పోరాట ఘ‌ట్టాల్ని చిత్రీక‌రిస్తున్నారు. అయితే తాజాగా అక్క‌డ కోవిడ్ కేసులు పెరిగిపోతుండ‌టంతో చిత్ర బృందం అనుకున్న స‌మ‌యానికే `ఖిలాడీ` షెడ్యూల్‌ని పూర్తి చేసేసింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డిస్తూ ఓ ఫొటోని అభిమానుల‌తో పంచుకున్నారు.

- Advertisement -

మాస్ రాజా ర‌వితేజ‌తో పాటు హీరో యాక్ష‌న్ కింగ్ అర్జున్, జ‌యంతి లాల్ గ‌డ వున్నారు. ఇందులో యాక్ష‌న్ హీరో అర్జున్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇట‌లీలో లాక్‌డౌన్ అమ‌ల్లోకి రాబోతోంది. ఇందుకు ముందే `ఖిలాడీ` షూటింగ్ పూర్తి కావ‌డంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంద‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All