మాస్ మహారాజా రవితేజ `బెంగాల్ టైగర్` తరువాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లని చవి చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి రవితేజ `క్రాక్` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ని దక్కించుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సాధించి మాస్ రాజాను సంక్రాంతి విజేతగా నిలబెట్టింది.
దీంతో మాస్ రాజా మళ్లీ ట్రాక్లోకి వచ్చేశారు. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ ఆనందంలో వున్న రవితేజ రెట్టించిన ఉత్సాహంతో `ఖిలాడీ` మూవీని పూర్తి చేస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో హవీష్ కోనేరు ప్రొడక్షన్స్ బ్యానర్పై కోనేరు సత్యనారాయణ, జయంతీలాల్ గడ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది.
ఈ విషయాన్ని మాస్ మహారాజా రవితేజ వెల్లడించారు. ఇటలీ వీధుల్లో ఛిల్ అవుతున్న ఓ ఫొటోని సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ ద్వారా అబిమానులతో పంచుకున్నారు. `చిల్లింగ్ ఇటలీ ఖిలాడి` అంటూ పోస్ట్ చేశారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో సీనియర్ హీరో అర్జున్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. హీరోయిన్ లుగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కనిపించనున్నారు.
View this post on Instagram