మాస్ మహారాజా రవితేజ ప్రయోగాత్మకంగా చేసిన `డిస్కోరాజా` ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. ఈ మూవీతో వరుసగా మరో ఫ్లాప్ని సొంతం చేసుకున్నారు రవితేజ. నేటి టిక్కెట్, డిస్కోరాజా .. ఇలా వరుస పరాజయాల తరువాత రవితేజ హీరోగా ఏ స్టూడియోస్ బ్యానర్పై హవీష్ ప్రొడక్షన్స్లో ఓ భారీ చిత్రాన్ని నిర్మాత కోనేరు సత్యనారాయణ ప్లాన్ చేశారు.
ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్తో `రాక్షసుడు` వంటి హిట్ చిత్రాన్ని అందించిన రమేష్వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కరోనా వైరస్ విజృంభించడానికి ముందు ఈ ప్రాజెక్ట్ని ప్రకటించారు. ఆ తరువాత ప్రారంభానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ చిత్రం ఆగిపోయిందంటూ వరుస కథనాలు వినిపించాయి.
వీటిలో ఎలాంటి వాస్తవం లేదని, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే కమర్షయల్ అంశాల మేళవింపుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నామని, కరోనా వ్యాప్తిలో భాగంగా లాక్డౌన్ విధించడంతో ఈ చిత్రానికి సంబంధించిన పనులు ఆగిపోయాయి. లాక్డౌన్ ముగిసి, సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే గ్రాండ్గా సినిమాని లాంచ్ చేస్తామని, భారీ బడ్జెట్, ఉన్నత స్థాయి సాంకేతిక విలువలతో తెరపై రానున్న ఈ చిత్రానికి పేరున్న సాంకేతిక నిపుణులు పనిచేస్తారని నిర్మాత కోనేరు సత్యనారాయణ ప్రకటించారు.