మాస్ మహారాజా రవితేజ వరుస ఫ్లాపుల తరువాత ఈ ఏడాది కొత్త పంథాలో ట్రైచేస్తున్నారు. రొటీన్ కథలతో కాకుండా కొత్త తరహా కథలపై దృష్టిపెట్టారాయన. గత ఏడాది ఫ్లాపుల కారణంగా సినిమా చేయని రవితేజ 2020లో మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ఒకే సారి రెండు చిత్రాల్ని అందించే ప్లాన్ చేశారు. అందులో ఒకటి `డిస్కోరాజా`, మరొకటి `క్రాక్`. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని` చిత్రాలు వరుస ఫ్లాప్లుగా నిలిచాయి. దీంతో ఆలోచనలోపడిన రవితేజ ఏడాది విరామం తీసుకుని రెండు చిత్రాలతో బరిలోకి దిగారు.
`డిస్కోరాజా` రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా రెట్రో మూవీగా సరికొత్త కథ, కథనాలతో వస్తోంది. ఇందులో రవితేజ కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్గా సాగే ఈ చిత్రం 90వ దశకం నేపథ్యంలో సాగనుందని అర్థమవుతోంది. ఇటీవల విడుదల చేసిన హీరో రవితేజ, హీరోయిన్ పాయల్ రాజ్పుల్ రెట్రో లుక్స్ సినిమాపై అంచనాలని పెంచేశాయి. తమన్ సంగీతంలో ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. న్యూ ఇయర్ రోజున ఈ సినిమా నుంచి మరో లుక్ని చిత్ర బృందం విడుదల చేసింది. సిగరెట్ కాలుస్తూ సీరియన్గా కనిపిస్తున్న లుక్ సినిమా రివేంజ్ డ్రామాగా సాగుతుందని తెలియజేస్తోంది.
ఇక ఇదే రోజు గోపీచంద్ మలినేనితో చేస్తున్న క్రాక్` లుక్ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేసిన లుక్లో పోలీస్ డ్రెస్లో గోలీ సోడా పట్టుకుని మాస్ రాజా రవితేజ సీరియస్గా చూస్తున్న తీరు సినిమా ఎంత సీరియస్గా వుండబోతోందో చెప్పేస్తోంది. రవితేజ నుంచి ప్రేక్షకులు ఎలాంటి మాస్ అంశాలు కోరుకుంటున్నారో అలాంటి అంశాలతో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టు అర్థమవుతోంది. ఇలా ఒకే ఏడాది మాస్ రాజా రవితేజ రెండు డిఫరెంట్ మూవీస్తో డబుల్ ధమాకా ఇవ్వబోతుండటం ఆసక్తికరంగా మారింది. డిస్కోరాజా ఈ నెల 24న రిలీజ్ కాబోతుండగా, క్రాక్ మాత్రం సమ్మర్లో రిలీజ్ కాబోతోంది.