లాక్డౌన్ బిఫోర్ మాస్ రాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కోనేరు సత్యనారాయణ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. దీంతో ఈ మూవీ ఆగిపోయినట్టేనా అనే వార్తలు వినిపించాయి.
ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈ మూవీ త్వరలోనే ప్రారంభం అవుతుందని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ చిత్రాన్ని హవీష్ ప్రొడక్షన్స్తో కలిసి బాలీవుడ్కు చెందిన పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. ఈ ఆదివారం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.
11గంటల 55 నిమిషాలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఇదే టైమ్కి ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేస్తున్నారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇందులో రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా సెకండ్ హీరోయిన్గా డింపుల్ హయాతి నటించనుంది. రమేష్ వర్మ రీసెంట్ గా `రాక్షసుడు` చిత్రంతో హిట్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.