దేశ వ్యాప్తంగా కరోనా విళయతాండవం చేస్తున్న వేళ జనాలు బయటికి రావడానికి భయపడుతున్నారు. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు కరోనా భయంతో ఇంటి పట్టునే వుంటున్నారు. క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న లాక్డౌన్ దగ్గరి నుంచి కూర్గ్లోని తన నివాసంలో వుంటోంది. ఇంటి పట్టునే వుంటూ నిత్యం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్లో వుంటోంది.
తనకు సంబంధించిన ఫొటోల్ని అభిమానులతో పంచుకుంటోంది. ఇటీవల సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వరుస హిట్లని సొంతం చేసుకున్న రష్మిక ప్రస్తుతం లాక్డౌన్ తొలగించడంతో తన మిత్రులకు స్పెషల్ గిఫ్ట్లు అందజేస్తోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్నకు చాలా మందే స్నేహితులున్నారు. వారి ఫ్యామిలీస్కి రష్మిక గిఫ్ట్ హ్యాంపర్లు పంపించింది. తనకు చెందిన ఫామ్లోని మ్యాంగోలని ప్రత్యేకంగా ప్యాక్ చేయించి మహేష్ ఫ్యామిలీకి పంపించింది.
దీనికి సంబంధించిన ఫొటోలని రష్మిక మందన్న సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మహేష్తో కలిసి రష్మిక `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇటీవల సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.