ఫిల్మ్ స్టార్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఆరోజుని అక్కడే ఎంజాయ్ చేస్తుంటారు. కన్నడ కస్తూరి రష్మిక మందన్న కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటోందట. మహేష్ తో కలిసి రష్మిక నటించిన తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. అనిల్రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 11న రిలీజ్ కానుంది. ఇటీవలే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్న రష్మిక తన తాజా చిత్రం కోసం ఇటలీ వెళ్లిపోయింది.
రష్మిక `సరిలేరు నీకెవ్వరు` తరువాత నితిన్ హీరోగా నటిస్తున్న `భీష్మ` చిత్రంలో నటిస్తోంది. `ఛలో` ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం ఇటీవలే ఇటలీ వెళ్లింది. అక్కడ రష్మిక, నితిన్లపై పాటలు చిత్రీకరించనున్నారట. జనవరి 1 వరకు అక్కడే వుండనున్న రష్మిక న్యూ ఇయర్ని అక్కడే సెలబ్రేట్ చేసుకోబోతోందట. జనవరి 5న ఎల్బీ స్టేడియంలో `సరిలేరు నీకెవ్వరు` ప్రీరిలీజ్ వేడుక జరుగనుంది.
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆ రోజు రష్మిక కూడా ప్రీరిలీజ్ కార్యక్రమంలో పాల్గొన నుంది. ఈ విషయాన్ని ఇటలీ వెళ్లే ముందే సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. నితిన్తో రష్మిక నటిస్తున్న `భీష్మ` వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న విడుదల కానుంది.