Homeటాప్ స్టోరీస్ఆడవాళ్లు థియేటర్ లో సందడి చేసిన శ్రీవల్లి

ఆడవాళ్లు థియేటర్ లో సందడి చేసిన శ్రీవల్లి

Rashmika Mandanna at AMJ theater
Rashmika Mandanna at AMJ theater

శ్రీవల్లి రష్మిక..తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు థియేటర్ లో సందడి చేసింది. శర్వానంద్, రష్మిక జంటగా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయగా.. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. గత వారమే విడుదల అవ్వాల్సి ఉండగా..భీమ్లా నాయక్ రిలీజ్ కారణంగా వాయిదా పడింది. పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటె నిన్న రష్మిక చాలా సింపుల్ లుక్ లో హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు చూసేందుకు వెళ్లింది. థియేటర్ లో ఆమెను చూసేందుకు అభిమానులు హడావుడి చేశారు. అక్కడ ఉన్న అభిమానుల వద్దకు వెళ్లి వారితో కలిసి కూర్చుని సినిమాను ఎంజాయ్ చేసింది. అభిమానులతో కలిసి సినిమా చూడటం చాలా బాగుంది అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ఇక పుష్ప మూవీ లో శ్రీవల్లి గా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న రష్మిక..ప్రస్తుతం తెలుగు, హిందీ , తమిళ్ చిత్రాల్లో నటిస్తుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All