Homeటాప్ స్టోరీస్ముంబైలో ర‌ష్మిక హంగామా మొద‌లైంది!

ముంబైలో ర‌ష్మిక హంగామా మొద‌లైంది!

ముంబైలో ర‌ష్మిక హంగామా మొద‌లైంది!
ముంబైలో ర‌ష్మిక హంగామా మొద‌లైంది!

ర‌ష్మిక మంద‌న్న‌కు 2020తో పాటు 2021 కూడా ల‌క్కీ ఇయ‌ర్‌గా మారిపోయింది. క‌రోనా.. లాక్ డౌన్ కార‌ణంగా గ‌త ఏడాది సినిమాలు ఎక్కువ‌గా రిలీజ్ కాక‌పోయినా ర‌ష్మిక మాత్రం స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది. స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా భారీ చిత్రాల్లో న‌టించే అవ‌కాశాన్ని సొంతం చేసుకుంది.

అల్లు అర్జున్‌తో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న `పుష్ప‌` చిత్రంలో న‌టిస్తున్న ర‌ష్మిక ఈ మూవీతో పాటు త‌మిళంలో కార్తి  హీరోగా న‌టిస్తున్న `సుల్తాన్‌`తో త‌మిళ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతోంది. శ‌ర్వానంద్‌తో `ఆడాళ్లూ మీకు జోహార్లు` చిత్రంలో న‌టిస్తూ బిజీగా మారిన ర‌ష్మిక ఇదే ఏడాది బాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -

సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా హీరోగా రూపొందుతున్న `మిష‌న్ మ‌జ్ను` చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. `సూప‌ర్ 30` ఫేమ్ వికాస్ బెహెల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌కు కూతురిగా న‌టిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ముంబైలో మొద‌లైంది. ఇందు కోసం ముంబై వెళ్లిన ర‌ష్మిక హీరో సిద్ధార్ధ్ మ‌ల్హోత్రాతో క‌లిసి షూటింగ్‌లో పాల్గొంటోంటూ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All