ఛలో మూవీ తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక..ఆ తర్వాత గీత గోవిందం తో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల విజయాలతో అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టడం..అవన్నీ కూడా పెద్ద విజయాలు సాధించడం తో అతి తక్కువ టైంలోనే రష్మిక టాప్ ప్లేస్ కు చేరుకుంది. కేవలం సినిమాలే కాదు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. ఇక గత ఏడాది పుష్ప మూవీ తో పాన్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు , హిందీ , తమిళ్ సినిమాలతో బిజీ గా ఉన్న ఈమెకు 2021 స్టార్టింగే నిరాశలో పడేసింది.
శర్వానంద్ కు జోడిగా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే మూవీ లో ఈమె నటించింది. ఈ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కిషోర్ తిరుమల డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ లో స్టార్ సీనియర్ నటీమణులు ఉన్నప్పటికీ కథనం బాగాలేకపోవడం వల్ల సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది. ఇక రష్మిక కు కూడా ఇందులో పెద్దగా చెప్పుకునే పాత్ర ఏమిలేదు. కేవలం రెమ్యునరేషన్ కోసమే రష్మిక ఈ సినిమా ఒప్పుకుందని విమర్శలు వినిపించాయి. ఇలా 2021 రష్మిక కు ప్లాప్ తో స్వాగతం పలికినట్లు అయ్యింది. ఇక రాబోయే చిత్రాలు ఎలా ఉంటాయో చూడాలి.