Homeటాప్ స్టోరీస్127 కోట్ల షేర్ సాధించిన రంగస్థలం

127 కోట్ల షేర్ సాధించిన రంగస్థలం

rangasthalam total share 127 croresమెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన రంగస్థలం చిత్రం మొత్తానికి 127 కోట్ల షేర్ ని సాధించింది . సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలోని చరణ్ నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు . చరణ్ సరసన సమంత నటించగా కీలక పాత్రల్లో జగపతిబాబు , ఆది పినిశెట్టి , ప్రకాష్ రాజ్ లు నటించారు . మార్చి 30 న భారీ ఎత్తున విడుదలైన రంగస్థలం చిత్రం 1980 నాటి బ్యాక్ డ్రాప్ స్టోరీ అయితే ఈ కథ నడుస్తుందా అని అనుమానం వ్యక్తం చేసిన వాళ్లకు దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చింది రంగస్థలం .

మార్నింగ్ షో నుండే పూర్తిగా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న రంగస్థలం మొత్తానికి భారీ వసూళ్లు సాధిస్తూ ప్రపంచ వ్యాప్తంగా 220 కోట్ల గ్రాస్ వసూళ్ల ని 127 కోట్ల షేర్ ని సాధించింది . నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది రంగస్థలం . చరణ్ కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది రంగస్థలం . మొత్తానికి 127 కోట్ల షేర్ తో రంగస్థలం క్లోజ్ అయ్యింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All