బాలీవుడ్లో ప్రేమాయణాలు కొత్తేమీ కాదు. అవి పెళ్లి పీటల దాకా వెళ్లిన ఉదంతాలు చాలా తక్కువే. ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్, రణవీర్సింగ్, దీపికా పదుకునే, ప్రియాంక చోప్రా, నికీజోనస్.. ఇలా చాల తక్కువ మందే వున్నారు. భగ్న ప్రేమికుల లిస్ట్ మాత్రం రేఖ నుంచి మొదు పెడితే పెద్ద లిస్టే వుంది. ఇదిలా వుంటే బాలీవుడ్లో గత కొన్ని నెలలుగా కొత్త జంట వార్తల్లో నిలుస్తూ హల్చల్ చేస్తోంది. ఆ జంట మరెవరో కాదు రణ్బీర్ కపూర్, అలియా భట్. రణ్బీర్ కపూర్ గతంలో దీపికా పదుకోన్, కత్రినా కైఫ్లతో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
ఆ ఇద్దరితో బ్రేకప్ చెప్పేసిన రణ్బీర్ కపూర్ కొత్తగా అలియాతో డేటింగ్ చేస్తున్నట్టు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇరు కుటుంబాల పెద్దలకు కూడా వీరి ప్రేమను అంగీకరించడంతో ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది.
దీంతో రణ్బీర్, అలియా నిత్యం హెడ్ లైన్స్లో వుంటున్నారు. తాజాగా వీరిద్దరిపై ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రణ్భీర్, అలియాభట్ వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నారని, కశ్మీర్లో వీరి వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారని వినిపిస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో అట్టహాసంగా వివాహం జరిగే అవకాశం వుందని తెలుస్తోంది.
అయితే తన పెళ్లి వార్తలపై మాత్రం అలియా భట్ మాత్రం స్పందించడం లేదు. పైకి అలాంటిది ఏమీ లేదని చెబుతున్న అలియా త్వరలోనే తన పెళ్లి వార్తలపై స్పందించడానికి సిద్ధమవుతోందని బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అలియాభట్, రణ్బీర్ కపూర్ తొలిసారి కలిసి `బ్రహ్మాస్త్న` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రణ్బీర్ శివుడిగా, అలియా ఈషగా, నాగార్జున మహావిష్ణువుగా కనిపించనున్నారు. సూపర్ హీరో కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మేలో రిలీజ్ చేయడానికి దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్లాన్ చేస్తున్నారు.