Homeగాసిప్స్రానా - రవితేజ ఆ రీమేక్ కోసం కలవనున్నారా?

రానా – రవితేజ ఆ రీమేక్ కోసం కలవనున్నారా?

రానా - రవితేజ ఆ రీమేక్ కోసం కలవనున్నారా?
రానా – రవితేజ ఆ రీమేక్ కోసం కలవనున్నారా?

గత కొంత కాలంగా మలయాళం సినిమా అయ్యప్పనుమ్ కోసియుమ్ టాలీవుడ్ లో బాగా హల్చల్ చేస్తోంది. ఈ సినిమా రీమేక్ హక్కులను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సొంతం చేసుకున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం వివిధ భాషల్లోకి ఇప్పుడు రీమేక్ అవుతోంది. అందులో తెలుగును సితార వారు నిర్మించనున్నారు. ఈ చిత్ర రీమేక్ హక్కులను కొనుగోలు చేసినప్పటి నుండి వివిధ హీరోల పేర్లు బయటకు వస్తున్నాయి.

మలయాళ చిత్రంలో హీరోలుగా బిజూ మీనన్, పృథ్వీరాజ్ లు కలిసి నటించారు. ఇద్దరు భిన్న నేపధ్యాలున్న వ్యక్తులు ఇగోల కారణంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. వారి కథలు ఎటువైపు వెళ్లాయి అన్న నేపథ్యంలో సినిమా ఉంటుంది. దీంతో టాలీవుడ్ లో ఈ సినిమాను ఏ హీరోలు చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

మొదటినుండి వినిపిస్తున్న పేరు రానా దగ్గుబాటి. ఈ రీమేక్ అనగానే రానా ఆసక్తి చూపించాడని సమాచారం. అలాగే మాస్ మహారాజా రవితేజ కూడా ఆసక్తిగానే ఉన్నాడని, కాకపోతే తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి తీసుకొస్తే నచ్చితే తప్పకుండ సినిమా చేస్తానని రవితేజ మాట ఇచ్చాడట.

ఇకపోతే సితార వారు ఈ చిత్రానికి దర్శకుడు వేటలో బిజీగా ఉన్నారు. రీమేక్స్ ను హ్యాండిల్ చేయడం అంత ఈజీ వ్యవహారం కాదు. అందులోనూ రీజినల్ టచ్ ఎక్కువ ఉండే మలయాళ సినిమాలను మన సెన్సిబిలిటీస్ కు తగ్గట్లుగా మార్పులు చేయడం కత్తి మీద సామే. అంత నేర్పు కలిగిన దర్శకుడి కోసం ప్రస్తుతం ప్రొడక్షన్ హౌజ్ వేటలో ఉంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఏడాదికి పైగా పట్టే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All