పవన్ కళ్యాణ్ , రానా కలయికలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ మూవీ భీమా నాయక్. సాగర్ కె చంద్ర డైరెక్షన్లో త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త రికార్డ్స్ నమోదు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి సృష్టిస్తుంది. ఈ క్రమంలో ఈ మూవీ లో డ్యానియేల్ శేఖర్ పాత్రలో తనదైన మార్కు నటనని ప్రదర్శించి ఆకట్టుకున్న రానా మీడియా తో ముచ్చటించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సినిమా రిలీజ్ తర్వాత తనకు వచ్చిన బెస్ట్ ప్రశంస..తన తండ్రి గారి నుండి వచ్చిందని తెలిపారు. మా నాన్న నా సినిమాలకు అంతగా ప్రశంసలు అందించరు. కానీ భీమ్లానాయక్ లో నా నటన చూసి సంతోషపడ్డారు. నా యాక్టింగ్ చాలా బాగుందని, సంతృప్తికరంగా ఉందని తెలిపాడు. ఇప్పటివరకు నాకొచ్చిన పెద్ద ప్రశంస ఇదే అంటూ రానా చెప్పుకొచ్చాడు.
ఇక పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. అంతకుముందు పవన్ కల్యాణ్తో నేను అంతగా ఇంటరాక్ట్ అవ్వలేదు. షూటింగ్ సమయంలో పవన్ను చాలా దగ్గరగా చూసి..ఆయన గురించి తెలుసుకున్నా. పవన్ చాలా సైలెన్స్ గా ఉండే వ్యక్తి. ఇతరుల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడడు.ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నానని తెలిపాడు. త్రివిక్రమ్ గారితో పనిచేయడం చాలా హ్యాపీ గా ఉంది. కేరళ కథలకు అక్కడి మనుషుల తీరు సంస్కృతి మనతో పోల్చితే డిఫరెంట్గా ఉంటుంది. అక్కడి ప్రేక్షకుల అభిరుచి కూడా వేరు. అలాంటి నేటివిటీ కథను మన ప్రేక్షకులకు సులభంగా రీచ్ అయ్యేలా మార్పులు చేర్పులు చేసారని రానా చెప్పుకొచ్చారు.