రానా, మిహీకా బజాజ్ల వెడ్డింగ్ హంగామా మొదలైంది. ఆగస్టు 8న రానా, మిహీకాల వివాహం జరగనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని వరల్డ్ ఫేమస్ లాక్ ఫలక్ నుమా ప్యాలెస్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు విధాలుగా పెళ్లి కోసం దగ్గుబాటి ఫ్యామిలీ ప్లాన్ చేస్తోంది.
ఆగస్టు 8 వరకు కరోనా ఉధృతి తగ్గితే అట్టహాసంగా… తగ్గకపోతే అత్యంత సన్నిహితుల మధ్య వివాహం జరపాలని ప్లాన్ ఏ, ప్లాన్ బీని రెడీ చేసుకున్నారు. ఇప్పటికే వివాహానికి ముందు జరిగే హంగామా మొదలైందని ఇప్పటికే రానా, మిహీకా హింట్ ఇచ్చేశారు. తాజాగా పెళ్లి కూతురికి సంబంధించిన షూస్ని గిఫ్ట్గా పొందానని వాటికి సంబంధించిన ఫొటోలని మిహీకా ఇన్స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసి పెళ్లి హంగామా మొదలైందని హింట్ ఇచ్చేసింది.
ఇదిలా వుంటే హైదరాబాద్లో కరోనా స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో పెళ్లికి వచ్చే అతిథుల లిస్ట్లో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఎక్కువ మంది వుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం వుంది కాబట్టి 10 నుంచి 15 మంది మాత్రమే వివాహ వేడుకలో పాల్గొనేలా ఫైనల్ లిస్ట్ని రానా, సురేష్బాబు ఫైనల్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.