రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం `విరాటపర్వం`. వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు `అరణ్య` చిత్రంలోనూ రానా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ని రానా కంప్లీట్ చేసినట్టు తెలిసింది. ఇదే చిత్రాన్ని హిందీలో `హాతీ మేరే సాథీ`గా తమిళంలో కాడన్` పేరుతో రిలీజ్ చేయబోతున్నారు.
ఇదిలా వుంటే రానాని `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ కోసం మేకర్స్ సంప్రదిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. దీంతో పాటు రానాని మరో చిత్రం కోసం కూడా మేకర్స్ సంప్రదిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
`కొండపొలం` నవల ఆధారంగా ఈ చిత్రాన్ని వికారాబాద్ అడవుల్లో చిత్రీకరిస్తున్నారు. రకుల్ ప్రీత్సింగ్ హీరోయిన్గా పక్కా గ్రామీణ యువతిగా నటిస్తోంది.ఈ చిత్రంలోని కీలక అతిథి పాత్ర కోసం రానాని దర్శకుడు క్రిష్ సంప్రదించినట్టు తెలిసింది. రానా కూడా పాత్ర నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.