సాయితేజ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ `రిపబ్లిక్`. దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. జె.బి. ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ బ్యానర్పై జె. భగవాన్, జె. పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమకాలీన రాజకీయ అంశాలపై సెటైరికల్ థ్రిల్లర్గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది.
శనివారం ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ని, ఆమె పాత్ర పేరుని చిత్ర బృందం విడుదల చేసింది. `తప్పూ ఒప్పులు లేవు.. అధికారం మాత్రమే శాశ్వతం` అని నమ్మే పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ విశాఖ శాణి పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతున్నట్టు చిత్ర బృందం పోస్టర్పై స్లోగన్తో స్పష్టం చేసింది. ఇందులోని మరో కీలక పాత్రలో జగపతిబాబు కూడా నటిస్తున్నారు.
జనం సమస్యలపై పోరాడే పవర్ఫుల్ యువకుడిగా ఇందులో సాయితేజ్ నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన సాయితేజ్ ఫస్ట్ లుక్కి విశేష స్పందన లబించింది. సమకాలీన రాజకీయాలపై దేవా కట్టా సంధిస్తున్న వ్యంగ్యాస్త్రంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులోని మిగతా పాత్రల్లో సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన తదితరులు నటిస్తున్నారు.
Thank you @sidkannan https://t.co/cxX4ikQpfs
— Ramya Krishnan (@meramyakrishnan) April 3, 2021