Homeటాప్ స్టోరీస్15 సంవత్సరముల తర్వాత భార్యని దర్శకత్వం చేయబోతున్న భర్త...

15 సంవత్సరముల తర్వాత భార్యని దర్శకత్వం చేయబోతున్న భర్త…

15 సంవత్సరముల తర్వాత భార్యని దర్శకత్వం చేయబోతున్న భర్త...
15 సంవత్సరముల తర్వాత భార్యని దర్శకత్వం చేయబోతున్న భర్త…

క్రియేటివ్ కమర్షియల్ డైరెక్టర్ ఎవరంటే తెలుగు సినిమాలలో ముందు వరుసలో అలాగే మన ఆలోచనల్లో నిలిచే దర్శకుడు ‘కృష్ణవంశీ’ గారు. ఒకే సినిమా-కళ మీద కాకుండా వివిధమైన సినిమా కళ (Genres) తీసేవారు. దాదాపు 1995 సంవత్సరం నుండి 2014 వరకు మంచి హిట్స్ ఉన్న దర్శకులుగా పేరున్న కృష్ణవంశీ కి మధ్య మధ్యలో ఫ్లాప్స్ ఎదురైనప్పటికీ ఎలాంటి బెదురు లేదు.

ఇక 2017 వచ్చిన ‘నక్షత్రం’ సినిమా ఘోరంగా విఫలం అయ్యింది. అప్పటికి పైసా, మొగుడు, మహాత్మ, శశిరేఖా పరిణయం లాంటి ఫ్లాప్స్ సినిమాలు ఉన్నా కూడా జనాలు కృష్ణవంశీ గారికి మంచి సపోర్ట్ గా ఉన్నారు. కృష్ణవంశీ గారు మాత్రం తరువాత తీయబోయే సినిమాలా మీద శ్రద్ధ పెట్టకపోవడమే ఇందుకు కారం అని పలు నిర్మాతలు అనేవారు. వారి మాటలకి మండిపడ్డ కృష్ణవంశీ గారు ఈ సారి తీయబోయే సినిమా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

- Advertisement -

ఇక తన భార్య అయిన రమ్య కృష్ణ గారి విషయం దగ్గరికి వస్తే ‘బాహుబలి‘ తర్వాత ఒక్కొక్క సినిమాని ఎంచుకుంటూ తనని తాను నటిగా, గొప్పగా మలుచుకుంటూ వస్తుంది. తన భర్త దర్శకత్వంలో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించిన రమ్యకృష్ణ 2004 లో వచ్చిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో చివరిగా కనిపించింది. ఇక ఆ తర్వాత కృష్ణవంశీ తీసిన ఏ సినిమాలో రమ్యకృష్ణ గారు నటించలేదు. అందుకే రమ్య కృష్ణ గారు కృష్ణ వంశీ గారు తీయబోయే తదుపరి సినిమాలో భాగం అవ్వాలి అనుకుంటుంది.

కృష్ణ వంశీ గారు ‘వందే మాతరం’ అనే సినిమాని మొదలు పెట్టారు. అందులో రమ్య కృష్ణ గారు పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు అని సినిమా యూనిట్ వారు అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడైతే ఎవరికీ తెలీదు కానీ తన భర్త ని విజయ పదం లో నడపాలి అని రమ్య కృష్ణ గారు చేస్తున్న కృషికి తగ్గ ఫలితం దక్కుతుంది అని ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణవంశీ గారి ఈ సారి అయిన మంచి విజయంతో జనాల ముందుకు రావాలి అని కోరుకుంటున్నారు కృష్ణవంశీ అభిమానాలు కూడా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All