Homeటాప్ స్టోరీస్బాలయ్య మీద కోపంతోనే ఇదంతా చేస్తున్నాడు

బాలయ్య మీద కోపంతోనే ఇదంతా చేస్తున్నాడు

నందమూరి బాలకృష్ణ మీద ఉన్న కోపంతోనే ఇదంతా చేస్తూ తెలుగుదేశం పార్టీ పరువుని , చంద్రబాబు పరువుని తీసి పడేస్తున్నాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ . బాలయ్య మీద వర్మ కు కోపం ఎందుకంటే ……… ఎన్టీఆర్ బయోపిక్ ని భారీ లెవల్ లో తీయాలని అనుకున్నాడు వర్మ , ఆమేరకు బాలయ్య ని కలిసాడు కూడా . అంతేకాదు ఎన్టీఆర్ గురించి పొగుడుతూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసాడు .

- Advertisement -

అయితే వర్మ గ్రాఫ్ సరిగా లేకపోవడంతో ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకత్వం వహించే ఛాన్స్ వర్మ కు ఇవ్వలేదు బాలయ్య . చాలామందిని అనుకున్నాక తేజ ని ఫైనల్ చేసాడు . అయితే బయోపిక్ స్టార్ట్ అయ్యాక తేజ తప్పుకున్నాడు . పోనీ తేజ తప్పుకున్న తర్వాత నైనా వర్మ కు ఛాన్స్ వస్తుందేమో అనుకుంటే అపుడు కూడా రకరకాల దర్శకుల పేర్లు వినిపించాయి చివరకు క్రిష్ వచ్చి చేరాడు . దాంతో వర్మ అహం దెబ్బతింది అందుకే లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని ప్రకటించాడు . అది ప్రకటించాకైనా బాలయ్య నుండి పిలుపు వస్తుందని అనుకున్నాడు కానీ అలా జరగలేదు దాంతో నిజంగానే నా అహం దెబ్బ తింటే ఎలా ఉంటుందో చూపించాలి అని గట్టిగా డిసైడ్ అయిన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని తీసి చంద్రబాబు పరువు తీసేసాడు . ఇక ఇప్పుడేమో కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే మరో వివాదాస్పద చిత్రానికి శ్రీకారం చుట్టాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All