ఎన్. లింగుస్వామి.. యాక్షన్ మాస్ మసాలా చిత్రాలకు తమిళంలో కేరాఫ్ అడ్రస్గా నిలిచిన దర్శకుడు. ఆయన తెరకెక్కించిన పందెంకోడ, అవారా చిత్రాలు అనూహ్య విజయాల్ని సాధించి హీరో విశాల్కు, కార్తీకి తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపుని తెచ్చి పెట్టాయి. గత కొంత కాలంగా తెలుగులో సినిమా చేయాలని లింగుస్వామి ప్రయత్నాలు చేస్తూనే వున్నారు కానీ కుదరడం లేదు.
తాజాగా ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఎనర్జిటిక్ హీరో రామ్తో ఆయన తెలుగు సినిమా చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుంత జరుగుతున్నాయి. `రెడ్` తరువాత మరే చిత్రాన్ని అంగీకరించని రామ్ ఫైనల్గా యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరున్న ఎన్.లింగుస్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.
ఈ భారీ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనున్నారట. ఇటీవలే కథ వినిపించిన లింగుస్వామి ఫైనల్గా రామ్ నుంచి గ్రీన్సిగ్నల్ రావడంతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయారని తెలిసింది. ఈ చిత్రాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? .. ఇదులో ఎవరెవరు నటిస్తారన్న విషయాల్ని చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిసింది.