వర్మకి గట్టి వార్నింగ్ పడింది. కరోనా క్రైసిస్ని తనకు అనుకూలంగా మార్చుకున్న వర్మ తన పేరుతో ఓటీటీని ప్రారంభించి బూతు సినిమాలని వరుసగా వదలడం మొదలుపెట్టాడు. ముందు పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో `క్లైమాక్స్` ఇనే పేరుతో ఓ బూతు సినిమాని వదిలిన వర్మ ఆ వెంటనే నగ్నం అంటూ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీ రాపాకని పరిచయం చేస్తూ మరో బూతు చిత్రాన్ని వర్మ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
పవర్స్టార్ అంటూ పవన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వర్మ చివరికి మిర్యాలగూడ హత్యోదంతం నేపథ్యంలో`మర్డర్` చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాడు. దీనికి ముందు అప్సరా రాణి నటించిన `థ్రిల్లర్` చిత్రాన్ని ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నాడు. 200 పర్ వ్యూ ముందుగా బుకింగ్ చేసుకుంటే 20 మంది లక్కీ విన్నర్స్కి తనని, అప్సరా రాణిని కలిసే అవకాశం కల్పిస్తామంటూ ఓ చీప్ పబ్లిసిటీని మొదలుపెట్టాడు వర్మ. దీనిపై ఓ నెటిజన్ వర్మకు దిమ్మదిరిగే కౌంటర్ వేశాడు.
`నువ్వే పెద్ద యూజ్ లెస్ డైరెక్టర్వి. నీతో ఇంటరాక్ట్ అయ్యే వాళ్లెవరు? ..200 పర్ వ్యూకు ఖర్చు చేసేకంటే హుచ్చా వెంకట్ సినిమాకి ఖర్చు చేస్తాను. ఎందుకంటే అతనికి మేకింగ్ తెలియదు, అయినా ఏదో చూపించాలని తనపతో సినిమాలు చేస్తుంటాడు. కానీ నీవు అలా కాదు.. చాలా ఏళ్లుగా ఫిల్మ్ మేకింగ్ అనుభవం వున్నా చెత్త సినిమాలు కావాలని తీస్తూనే వున్నావు` అని వర్మని ఏ రేంజ్లో ఏకి పారేశాడు. వర్మ నుంచి మాత్రం నో రిప్లై..