Homeటాప్ స్టోరీస్వ‌ర్మ మ‌ళ్లీ ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్టారుగా!

వ‌ర్మ మ‌ళ్లీ ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్టారుగా!

వ‌ర్మ మ‌ళ్లీ ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్టారుగా!
వ‌ర్మ మ‌ళ్లీ ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్టారుగా!

రామ్‌గోపాల్‌వ‌ర్మ ఏది చేసినా సంచ‌ల‌న‌మే. గ‌త కొంత కాలంగా సంచ‌ల‌నాల చుట్టూనే తిరుగుతున్న వ‌ర్మ వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోయారు. నిత్యం వార్త‌ల్లో నిల‌వ‌డం కోసం దేనికైనా వెనుకాడ‌ని నైజం వ‌ర్మ సొంతం. జీఎస్టీ, ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌, అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు వంటి చిత్రాల‌తో వివాదాల్ని సృష్టించిన ఆయ‌న తాజాగా మ‌రో వివాదానికి తెర‌లేపారు.

ఇటీవల అగ‌స్త్య మంజుతో `బ్యూటిఫుల్‌` చిత్రాన్ని నిర్మించిన వ‌ర్మ ఆ సినిమా రిలీజ్ వేళ‌ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. అది మ‌ర్చిపోక‌ముందే మ‌రో ర‌చ్చ‌కు తెర‌లేపారు. త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌బోతున్నాన‌ని సోషల్ మీడియా ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించిన వ‌ర్మ `ముప్పావ‌లా` పేరుతో ఆ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం వివాదాస్ప‌దంగా మారింది. ఈ టైటిల్‌కు క్యాప్ష‌న్‌గా `మూడు పావులాల క‌థ‌` అని పెట్ట‌డం మ‌రింత ఆజ్యం పోస్తోంది.

- Advertisement -

అయితే ఇది మార్ఫింగ్ చేసిన పోస్ట‌ర్ అని, దీన్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని, కావాలంటే త‌న ట్వీట్ట‌ర్ పేజీ హిస్ట‌రీని ఒక‌సారి చెక్ చేసుకోవాల‌ని వ‌ర్మ వివ‌ర‌ణ ఇచ్చారు. దీంతో `ముప్పావ‌లా` పేరుతో వైర‌ల్ అయిన పోస్టర్‌కు వ‌ర్మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని తేలిపోయింది. అస‌లు ఈ పోస్ట‌ర్‌ని ఎవ‌రు మార్ఫింగ్ చేశారు. ఎందుకు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశార‌న్న‌ది తెలియాల్సి వుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All