Homeటాప్ స్టోరీస్వ‌ర్మ కొత్త చిత్రం ప్ర‌క‌టించేశాడు!

వ‌ర్మ కొత్త చిత్రం ప్ర‌క‌టించేశాడు!

వ‌ర్మ కొత్త చిత్రం ప్ర‌క‌టించేశాడు!
వ‌ర్మ కొత్త చిత్రం ప్ర‌క‌టించేశాడు!

నిత్యం వివాదాస్ప‌ద అంశాల‌తో వార్త‌ల్లో నిలిచే దర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ గ‌త ఏడాది వ‌రుస వివాదాల‌తో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. తాజాగా మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో ఓ ఇండో చైనీస్ చిత్రాన్ని రూపొందిస్తున్న వ‌ర్మ త్వ‌ర‌లో మ‌రో వివాదాస్ప‌ద అంశంతో సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. తెలంగాణ హైద‌రాబాద్ శివారు ప్రాంతం అయిన షాద్‌న‌గ‌ర్ స‌మీపంలోని తొండు ప‌ల్లి టోల్ ప్లాజా వ‌ద్ద జరిగిన దిష సంఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన విష‌యం తెలిసిందే.

ఇదే అంశాన్ని తీసుకుని వ‌ర్మ ఓ సినిమాని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. గ‌త రెండు మూడు రోజులుగా నిర్భ‌య హంత‌కుల‌పై వ‌రుస పోస్ట్‌ల‌తో సంచ‌ల‌నం సృష్టిస్తున్న వ‌ర్మ తాజాగా పెట్టిన ఓ పోస్ట్ ఆస‌క్తిక‌రంగా మారింది. న‌లుగురు అర్ధ్ర‌రాత్రి ఢిల్లీ వీధుల్లో నిర్భ‌య‌పై అత్యాచారం చేసి చంపేస్తే చ‌ట్టాలు వారిని కాపాడుతూ నిర్భ‌య‌ని మ‌న సిస్ట‌మ్ గ్యాంగ్ రేప్ చేస్తోంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ స‌ఘ‌ట‌న‌ని దిష సంఘ‌న‌తో ముడిపెడుతూ ఆయ‌న పెట్టిన పోస్ట్ మ‌రింత‌గా వైర‌ల్ అవుతోంది.

- Advertisement -

నిర్భ‌య సంఘ‌ట‌న త‌రువాత జ‌రిగిన దిష ఎదంతాన్ని ప‌రిశీలిస్తే రేపిస్టులు భ‌యం పెర‌గ‌కపోగా త‌ప్పులు చేయ‌కుండా ఎలా త‌న్పించుకోవాలో నేర్చుకుంటున్నార‌ని, ఎన్ని శిక్ష‌లు విధించినా రేప్‌లు మాత్రం ఆప‌డం లేద‌ని, అయితే తాను తీయ‌బోయే సినిమా చూస్తే మాత్రం రేప్ అనే ఆలోచ‌న వ‌స్తేనే వాళ్ల వెన్నులో వ‌ణుకు పుడుతుంద‌ని వ‌ర్మ స్ప‌ష్టం చేశారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All