వరుస హిట్లతో మళ్లీ ట్రాక్లోకి వచ్చాడు మెగా మేనల్లుడు సాయిధరమ్తేజ్. ఇదే జోరుని తొలి చిత్రంతోనే మొదలుపెట్టాలని అతని తమ్ముడు వైష్టవ్తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మైత్రీమూవీమేకర్స్ బ్యానర్పై సుకుమార్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సుక్కు శిష్యుడు చిట్టిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కృతి శెట్టి హీరోయిన్గా తెలుగులో ఎంట్రీ ఇస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ని రిలీజ్ చేసి వైష్టవ్ తేజ్కి ఇండస్ట్రీలోకి వెల్కమ్ చెప్పిన రామ్చరణ్ తాజాగా ఈ చిత్ర పోస్టర్ని రిలీజ్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఫషేస్బుక్లో రామ్చరణ్ ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేయడం ఆకట్టుకుంటోంది. `బిగ్ వెల్కమ్ వైష్టవ్ తేజ్!. ఈ ప్రయాణాన్ని నువ్వు ప్రేమిస్తావు, పూర్తిస్థాయిలో దీన్ని ఆస్వాదిస్తావు. బుచ్చిబాబు సానా, కృతిశెట్టి, మైత్రీ మూవీమేకర్స్ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్` అని పోస్ట్ పెట్టాడు. ఇది సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ని ఆకట్టుకుంటోంది.
విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం జాలరుల జీవితాల్లోని వెతలు, ప్రేమలు. పగా ప్రతీకారాల్ని తెరపై చూపించబోతున్నారు. విజయ్సేతుపతి నటన, రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం, శామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. ఏప్రిల్ 2న ఈ చిత్రం విడుదల కానుంది.