Homeగాసిప్స్మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తానంటున్న రామ్ చరణ్, శంకర్

మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తానంటున్న రామ్ చరణ్, శంకర్

మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తానంటున్న రామ్ చరణ్, శంకర్
మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తానంటున్న రామ్ చరణ్, శంకర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ కలిసి సినిమా చేస్తానంటున్న సంగతి తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ అనగానే అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించాలని ప్లాన్ చేసాడు. మొన్నటిదాకా ఈ ప్రాజెక్ట్ పై బోలెడన్ని రూమర్లు ఉన్నా కానీ అవన్నీ రీసెంట్ గా పటాపంచలయ్యాయి.

శంకర్ ఇంట్లో వీరి ముగ్గురికీ మీటింగ్ జరిగింది. ఈ ప్రాజెక్ట్ కు ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. శంకర్ కు ఉన్న లీగల్ చిక్కులు కూడా వీడిపోవడంతో ఈ భారీ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. వచ్చే నెల నుండి ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

ఇప్పటిదాకా శంకర్ సినిమాలు అన్నీ క్లాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని చేసిన సినిమాలే. అయితే చరణ్ చిత్రంతో మాత్రం మాస్ ను ప్రధానంగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మాస్ అంశాలు పుష్కలంగా ఈ చిత్రంలో ఉన్నాయిట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All