మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ కలిసి సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించనున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిందో లేదో వివాదం చుట్టుముట్టింది. శంకర్ ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేసి కానీ మరో సినిమా చేయకూడదని లైకా ప్రొడక్షన్స్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది.
దీంతో రామ్ చరణ్ – శంకర్ చిత్రంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదిలా ఉంటే రీసెంట్ గా రామ్ చరణ్, శంకర్ మధ్య మీటింగ్ ఉండబోతోందని, దీంతో సినిమా ఫ్యూచర్ పై క్లారిటీ వస్తుందని తెల్సింది. దీనికి తగ్గట్లుగానే నిన్న చరణ్, శంకర్, దిల్ రాజు లు చెన్నైలో మీట్ అయ్యారు.
“నిన్న చెన్నైలో అద్భుతంగా గడిచింది. శంకర్ కు అతని కుటుంబానికి నా ధన్యవాదాలు, ఇంత బాగా హోస్ట్ చేసినందుకు. నా 15వ చిత్రం కోసం ఎదురుచూస్తున్నా. త్వరలో అప్డేట్స్ వస్తాయి” అని చరణ్ ట్వీట్ చేసాడు.
Had a fabulous day in Chennai yesterday !
Thank you @shankarshanmugh Sir and family for being such great hosts.
Looking forward to #RC15.
Updates coming very soon! @SVC_official #SVC50 pic.twitter.com/4qNLwF9HYw— Ram Charan (@AlwaysRamCharan) July 5, 2021