తాము నటించే సినిమా కోసం నటీనటులు ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారన్నది తెలిసిందే. కొందరు స్లిమ్గా మారుతుంటారు. మరి కొంత మంది బొద్దుగా సిద్ధమవుతుంటారు. రకుల్ ప్రీత్సింగ్ కూడా బాలీవుడ్ మూవీ `దే దే ప్యార్ దే` సినిమా కోసం దాదాపు 8 కేజీలు తగ్గి స్లిమ్గా మారింది. అయితే అప్పట్లో ఆమె రూపాన్ని చూసి కొంత మంది నెటిజన్స్ ట్రోల్ చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలోట్రోలర్స్కి స్పార్ట్గా రిప్లై ఇచ్చి షాకిచ్చింది. `దేదే ప్యానర్ దే` చిత్రంలో అజయ్ దేవ్గన్, టబు వంటి తారలతో కలిసి నటించాను. ఆ అవకాశాన్ని వదులుకోవద్దిని గట్టిగా నిర్ణయించుకుని ఎలాగైనా ఈ అవకాశాన్ని వదులుకోవద్దని ప్రతిరోజూ జిమ్కి వెళ్లాను. కేవలం 40 రోజుల్లో 8 కిలోలు తగ్గాను అని తెలిపింది.
`నేను చాలా స్లిమ్ అయ్యానని చాలా మంది ఆశ్చర్యపోయారు. తెలుగులో ఇక నాకు సినిమాలు రావడం కష్టమే` అని కామెంట్ చేశారు. అయితే నేను ఆ కామెంట్స్ని సీరియస్గా తీసుకోలేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నాను` అని తెలిపింది. రకుల్ ప్రస్తుతం క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రంతో పాటు నితిన్ హీరోగా నటిస్తున్న `చెక్`లో నటిస్తోంది. బాలీవుడ్లో మేడే` చిత్రంలో నటిస్తోంది.