రకుల్ ప్రీత్ సింగ్ కు ప్లైట్ కష్టాలు వచ్చి పడ్డాయి పాపం . నిన్న రాత్రి నుండి కూడా ముంబై ఎయిర్ పోర్ట్ లోనే ఉండిపోయిందట ఈ విషయాన్నీ స్వయంగా రకుల్ ట్వీట్ చేసింది . బాలీవుడ్ సినిమా కోసం ముంబై వెళ్లిన ఈ భామ తిరిగి హైద్రాబాద్ రావడానికి పాపం ఎయిర్ పోర్ట్ కు వచ్చింది కానీ ముంబైలో భారీ వర్షాలు కురవడం వల్ల ఎయిర్ పోర్ట్ నుండి ప్లైట్ లు వెళ్లడం లేదు . దాంతో నిన్న రాత్రి నుండి ఎయిర్ పోర్ట్ లోనే ఉండిపోయిందట పాపం .
ముంబై లో గత నాలుగు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి దాంతో ముంబై నగరం తడిసి ముద్దయ్యింది . ముంబై రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి . ఇక ఎయిర్ పోర్ట్ లో కూడా పెద్ద ఎత్తున నీళ్లు నిలిచాయి దాంతో ప్లైట్ రాకపోకలు ఆగిపోయాయి .
- Advertisement -