గతేడాది రకుల్ ప్రీత్ సింగ్ పేరు వార్తల్లో చాలా రకాలుగా ప్రచారం జరిగింది. డ్రగ్స్ కేసులో రకుల్ ను లింక్ చేస్తూ కేసు ఫైల్ చేయడంతో విచారణకు కూడా హాజరైంది. అయితే ఇప్పుడు ఆ కథ మొత్తం పూర్తవ్వడంతో రిలీఫ్ కోసం రకుల్ ప్రీత్ మాల్దీవ్స్ కు తన కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్ళింది.
అక్కడ చాలా రోజులు ఎంజాయ్ చేసిన రకుల్ ఇటీవలే తిరిగి ఇండియాకొచ్చింది. మాల్దీవ్స్ లో ఉన్నన్ని రోజులు తన హాట్ ఫొటోలతో, వీడియోలతో హల్చల్ చేసింది రకుల్.
ఇక ఇప్పుడు స్వదేశానికి రావడంతో తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టింది. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన రకుల్ ఇప్పుడు తమిళ సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది. శివ కార్తికేయన్ హీరోగా రకుల్ హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ లో నేటి నుండి పాల్గొంటోంది రకుల్.