Homeటాప్ స్టోరీస్మీడియాపై ఫైర్ అవుతున్న స్టార్ హీరోయిన్‌!

మీడియాపై ఫైర్ అవుతున్న స్టార్ హీరోయిన్‌!

మీడియాపై ఫైర్ అవుతున్న స్టార్ హీరోయిన్‌!
మీడియాపై ఫైర్ అవుతున్న స్టార్ హీరోయిన్‌!

మీడియాపై స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్  ఫైర‌వుతోంది. గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో రేసులో వెన‌క బ‌డిన ర‌కుల్ భారీ ఆఫ‌ర్ల‌ని పొంద లేక‌పోతోంది. `స్పైడ‌ర్‌, దేవ్‌, మ‌న్న‌థుడు 2 వంటి ఫ్లాప్ల‌ త‌రువాత క్రేజ్ త‌గ్గిపోవ‌డంతో త‌నని వెతుక్కుంటూ వ‌చ్చిన చిత్రాల‌నే అంగీక‌రిస్తోంది. తెలుగులో  నితిన్ హ‌రోగా చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి తెర‌కెక్కిస్తున్న చిత్రంలో న‌టిస్తోంది.

ఈ మూవీతో పాటు త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్ తో శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న `ఇండియ‌న్ 2`, శివ కార్తికేయ‌న్ హీరోగా రూపొందుతున్న `అయాల‌‌న్‌` చిత్రాల్లో న‌టిస్తోంది. ఇదిలా వుంటే త‌మిళ చిత్రం `అయాల‌న్‌` షూటింగ్ లో పాల్గొన‌మ‌ని చిత్ర బృందం సంప్ర‌దిస్తుంటే ర‌కుల్ మాత్రం ముఖం చాటేస్తోంద‌ట‌. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో వైర‌స్ పూర్తిగా త‌గ్గిన త‌రువాతే తాను షూటింగ్‌లో పాల్గొంటాన‌ని ర‌కుల్ మేక‌ర్స్‌ని ఇబ్బంది పెడుతోంద‌ని త‌మిళ మీడియాలో వార్తా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఈ వార్త‌ల‌పై ర‌కుల్ ప్రీత్‌సింగ్ మండిప‌డింది. `జ‌ర్న‌లిజం ఎప్పుడూ బాధ్య‌తాయుతంత‌గానే వ్య‌వ‌హ‌రిస్తుంది. వాస్త‌వాల‌ని చెక్ చేస్తుంటుంది. కొన్ని సార్లు ఎక్కువ క్లిక్స్ కోసం ప్ర‌య‌త్నిస్తూ వుంటుంది. వ‌ర్క్ చేయాల‌ని త‌పించిపోతున్నాను. ఎవ‌రు ఎక్క‌డ షూటింగ్స్ మొద‌లు పెడుతున్నారో ద‌య‌చేసి నాకు చెప్పండి` అంటూ మీడియాపై కౌంట‌ర్ ఇచ్చింది. ఓ బాలీవుడ్ మీడియా రాసిన క‌థ‌నానికి ర‌కుల్ పై విధంగా స్పందించింది. ర‌కుల్ వాద‌న నిజ‌మే క‌దా? క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో షూటింగ్‌లు చేయ‌డానికి ఎవ‌రూ సాహ‌సించ‌డం లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All