మీడియాపై స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫైరవుతోంది. గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో రేసులో వెనక బడిన రకుల్ భారీ ఆఫర్లని పొంద లేకపోతోంది. `స్పైడర్, దేవ్, మన్నథుడు 2 వంటి ఫ్లాప్ల తరువాత క్రేజ్ తగ్గిపోవడంతో తనని వెతుక్కుంటూ వచ్చిన చిత్రాలనే అంగీకరిస్తోంది. తెలుగులో నితిన్ హరోగా చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తోంది.
ఈ మూవీతో పాటు తమిళంలో కమల్హాసన్ తో శంకర్ తెరకెక్కిస్తున్న `ఇండియన్ 2`, శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న `అయాలన్` చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా వుంటే తమిళ చిత్రం `అయాలన్` షూటింగ్ లో పాల్గొనమని చిత్ర బృందం సంప్రదిస్తుంటే రకుల్ మాత్రం ముఖం చాటేస్తోందట. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో వైరస్ పూర్తిగా తగ్గిన తరువాతే తాను షూటింగ్లో పాల్గొంటానని రకుల్ మేకర్స్ని ఇబ్బంది పెడుతోందని తమిళ మీడియాలో వార్తా కథనాలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలపై రకుల్ ప్రీత్సింగ్ మండిపడింది. `జర్నలిజం ఎప్పుడూ బాధ్యతాయుతంతగానే వ్యవహరిస్తుంది. వాస్తవాలని చెక్ చేస్తుంటుంది. కొన్ని సార్లు ఎక్కువ క్లిక్స్ కోసం ప్రయత్నిస్తూ వుంటుంది. వర్క్ చేయాలని తపించిపోతున్నాను. ఎవరు ఎక్కడ షూటింగ్స్ మొదలు పెడుతున్నారో దయచేసి నాకు చెప్పండి` అంటూ మీడియాపై కౌంటర్ ఇచ్చింది. ఓ బాలీవుడ్ మీడియా రాసిన కథనానికి రకుల్ పై విధంగా స్పందించింది. రకుల్ వాదన నిజమే కదా? కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో షూటింగ్లు చేయడానికి ఎవరూ సాహసించడం లేదు.