సూపర్స్టార్ రజనీకాంత్కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్రం గురువారం రజనీకి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రకటించింది. 51 దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని సూపర్స్టార్ రజనీకి అందిస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పురస్కరాన్ని సినీ రంగంలో అత్యున్నత అవార్డుగా భావిస్తుంటారు.
దక్షిణభారత సినీ పరిశ్రమకు రజనీ కాంత్ చేసిన సేవలకు గానూ కేంద్రం ఈ పురస్కారాన్ని రజనీకి ప్రకటించింది. గత కొంత కాలంగా తెలుగు, తమిళ, హిందీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వున్న అభిమానుల్ని విశేషంగా అలరిస్తున్నారు. జపాన్ వాసుల్లోనూ ఆయనకు అభిమానులుండటం విశేషం. గత 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో రజనీ ఎన్నో విజయవంతంమైన చిత్రాలతో పాటు `బాషా` వంటి పాథ్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్లని ఎన్నింటినో అందించారు.
తనదైన స్టైల్స్తో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అయితే రజనీ ఈ అవార్డుకి అర్హుడే అయినా తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయనకు ఈ పుస్కారాన్ని ప్రకటించడం మాత్రం పలు అనుమానాలకు తావిస్తోంది. తమిళనాట రాజకీయ లబ్ది కోసమే కేంద్రంలో వున్న బీజేపీ రజనీకి అవార్డుని ప్రకటించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా రజనీ బీజేపీకి మద్దతుగా మాట్లాడటం కూడా ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది.