Homeగాసిప్స్ఇద్ద‌రు దిగ్గజాల చిత్రం నెక్ట్స్ ఇయ‌ర్ స్టార్ట్‌?

ఇద్ద‌రు దిగ్గజాల చిత్రం నెక్ట్స్ ఇయ‌ర్ స్టార్ట్‌?

ఇద్ద‌రు దిగ్గజాల చిత్రం నెక్ట్స్ ఇయ‌ర్ స్టార్ట్‌?
ఇద్ద‌రు దిగ్గజాల చిత్రం నెక్ట్స్ ఇయ‌ర్ స్టార్ట్‌?

కోలీవుడ్‌లో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కి, లోక‌నాయ‌కుడు, వెర్స‌టైల్ యాక్ట‌ర్ క‌మ‌ల్‌హాస‌న్‌కు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ వున్న విష‌యం తెలిసిందే. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఓ సినిమా చేస్తే ఆ ఊహే ర‌జ‌నీ, క‌మ‌ల్ అభిమానుల్ని సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కి గురిచేస్తోంది. చాలా ఏళ్ల త‌రువాత ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో ఓభారీ చిత్రం రానుంద‌ని గ‌త కొన్ని నెల‌లుగా వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో క‌మ‌ల్ న‌టించ‌డం లేదు కేవ‌లం నిర్మాత‌గానే వ్యవ‌హ‌రించ‌బోతున్నార‌ట‌.

రాజ్‌క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై క‌మ‌ల్‌హాస‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా ఓ భారీ చిత్రం చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. రాజ‌కీయంగా ఇద్ద‌రి మ‌ధ్య దారులు వేరైనా గ‌త కొన్నేళ్లుగా వీరిద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహ బంధం కొన‌సాగుతోంది. అదే ర‌జ‌నీతో సినిమా చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా మారింద‌ట. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి `ఖైదీ`, మాస్ట‌ర్ చిత్రాల ఫేమ్ లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ట‌.

- Advertisement -

అయితే ఈ సినిమా కార్య‌రూపం దాల్చ‌డం లేద‌ని వార్త‌లు షికారు చేశాయి. అయితే ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని, వ‌చ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంద‌ని తాజాగా వార్త‌లు వినిపిస్తున్నాయి. క‌మ‌ల్‌హాస‌న్ ప్ర‌స్తుతం `ఇండియ‌న్ 2` లో న‌టిస్తున్నారు. ర‌జ‌నీ `అన్నాతే` చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్త‌యిన త‌రువాతే ర‌జ‌నీ, లోకేష్ క‌న‌క‌రాజ్‌ల చిత్రం సెట్స్‌పైకి రానుంద‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All