కోలీవుడ్లో సూపర్స్టార్ రజనీకాంత్కి, లోకనాయకుడు, వెర్సటైల్ యాక్టర్ కమల్హాసన్కు ప్రత్యేకమైన ఇమేజ్ వున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే ఆ ఊహే రజనీ, కమల్ అభిమానుల్ని సంభ్రమాశ్చర్యాలకి గురిచేస్తోంది. చాలా ఏళ్ల తరువాత ఈ ఇద్దరి కలయికలో ఓభారీ చిత్రం రానుందని గత కొన్ని నెలలుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో కమల్ నటించడం లేదు కేవలం నిర్మాతగానే వ్యవహరించబోతున్నారట.
రాజ్కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్పై కమల్హాసన్ సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా ఓ భారీ చిత్రం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రాజకీయంగా ఇద్దరి మధ్య దారులు వేరైనా గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం కొనసాగుతోంది. అదే రజనీతో సినిమా చేయడానికి ప్రధాన కారణంగా మారిందట. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి `ఖైదీ`, మాస్టర్ చిత్రాల ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారట.
అయితే ఈ సినిమా కార్యరూపం దాల్చడం లేదని వార్తలు షికారు చేశాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్పైకి రానుందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. కమల్హాసన్ ప్రస్తుతం `ఇండియన్ 2` లో నటిస్తున్నారు. రజనీ `అన్నాతే` చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తరువాతే రజనీ, లోకేష్ కనకరాజ్ల చిత్రం సెట్స్పైకి రానుందని తెలిసింది.