తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ స్పీడు పెంచారు. గతంలో సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుంటూ వచ్చిన రజనీ గత కొంత కాలంగా వరుస చిత్రాల్ని వెంట వెంటనే సెట్స్పైకి తీసుకెళుతూ యంగ్ హీరోలకు ధీటుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త దర్శకుల్ని ప్రొత్సహిస్తున్నారాయన. ఇటీవల పా. రంజిత్ కి అవకాశం ఇచ్చిన రజనీ అతనితో `కబాలి`, కాలా` చిత్రాలకు పనిచేశారు. ఆ తరువాత యంగ్ డైరెక్టర్ `పిజ్జా` ఫేమ్ కార్తీక్ సుబ్బరాజుతో కలిసి `పేట్టా` చిత్రాన్ని చేశారు.
ప్రస్తుతం పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజనీ నటిస్తున్న చిత్రం `దర్బార్`. చాలా ఏళ్ల విరామం తరువాత రజనీ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న చిత్రమిది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై అల్లి రాజా సుభాస్కరన్ ఈ చిత్నాన్ని నిర్మిస్తున్నారు. తొలిసారి ఈ సినిమా ద్వారా ఎ.ఆర్. మురుగదాస్తో రజనీ పనిచేస్తున్నారు. ఈ పినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఇటీవలే ఆడియో రిలీజ్ అయిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇదిలా వుంటే రజనీ ఒక సినిమా రిలీజ్కి ముందే మరో చిత్రాన్ని లైన్లో పెట్టారు.
అజిత్తో వరుస చిత్రాల్ని రూపొందించి కమర్షియల్ హిట్లని అందించిన శివ దర్శకత్వంలో రజనీకాంత్ తన 168వ చిత్రాన్ని చేస్తున్నారు. `తలైవర్ 168` అనే వర్కింగ్ టైటిల్ని ఖరారు చేసిన ఈ చిత్ర షూటింగ్ బుధవారం హైదరాబాద్లో లాంఛనంగా మొదలైనట్టు తెలిసింది. రజనీకి జోడీగా ఇందులో కీర్తిసురేష్ నటిస్తోంది. కీలక పాత్రల్లో మీనా, ఖుష్బూ నటిస్తుండగా విలన్గా విలక్షణ నటుడు ప్రకాష్రాజ్ కనిపించబోతున్నారు. మీనా, రజనీ కలిసి గతంలో `ముత్తు` చిత్రంలో నటించారు. చాలా ఏళ్ల విరామం తరువాత ఇద్దరు కలిసి 24 ఏళ్ల విరామం తరువాత మరోసారి నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. రజనీ, కీర్తిసురేష్లపై ముహూర్త సన్నివేశాన్ని చిత్రీకరించారు. తాజా షెడ్యూల్ చెన్నైలో ప్రారంభం కానుంది.