`అల వైకుంఠపురములో` ఇండస్ట్రీ హిట్ తరువాత అల్లు అర్జున్ ప్లాన్ మారింది. సినిమా చేసే తీరు మారింది. ఇప్పుడు బన్నీ ప్లాన్స్ పాన్ ఇండియా స్థాయిలో వున్నాయి. అందకు తగ్గట్టుగానే బన్నీ నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప` రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో గంధపు చక్కల స్మగ్లింగ్ ఆధారంగా ఈ చిత్రంలో తెరపైకి రాబోతోంది. అత్యంత సహజత్వంగా సాగే ఈ చిత్రంలో హీరో బన్నీ లారీ డ్రైవర్గా రగ్గడ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. పుష్పరాజ్గా బన్నీ పాత్ర నెగెటివ్ అప్రోచ్తో సాగుతుందని తెలుస్తోంది.
ఇదిలా వుంటే రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం కోసం బాలీవుడ్ విలన్ అయితే రీచింగ్ బాగుంటుందని ప్లాన్ చేశారట. ఇప్పటికే బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని చిత్ర బృందం సంప్రదించినట్టు సమాచారం. ఇటీవల రజనీకాంత్ నటించిన `దర్బార్` చిత్రంలో సునీల్ శెట్టి విలన్గా నటించిన విషయం తెలిసిందే.