తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. రజనీ తను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నానని పార్టీని కూడా ప్రకటించినా ఇప్పటికీ దీని కార్యకలాపాలపై క్లారిటీని ఇవ్వడం లేదు. అసలు రజనీ రాజకీయ అరంగేట్రం చేశారా? చేస్తున్నారా? అన్నది ఇప్పటికీ అంతుక్కడం లేదు. ఇదిలా వుంటే రజనీకాంత్ ఈ సోమవారం `రజనీ మక్కల్ మండ్రమ్` నిర్వాహకులతో ప్రత్యేకంగా సమావేశ మయ్యారు.
చెన్నైలోని స్థానిక రాఘవేంద్ర కల్యాణ మండపంలో మక్కల్ మండ్రమ్ జిల్లా కార్యదర్శులతో రజనీ సమావేశమయ్యారు. రాజకీయ అరంగేట్రంపై ప్రధాన చర్చ కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం పలు కీలక విషయాల్ని రజనీ స్వయంగా మీడియాకు వివరించనున్నట్టు టాక్. ఈ భేటీకి ముందు రజనీ నివాసం యుందు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రజనీ రాకీయాల్లోకి రావాలంటే నినాదాలు చేశారు.
తమిళనాడు శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రజనీ ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డిసెంబర్ 12న రజనీ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో కీలక ప్రకటన వెలువడే ఆవకాశం వుందని, వచ్చే ఎన్నికల్లో రజనీ పార్టీ పోటీకి దిగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయ ఇతే మూడేళ్ల క్రితం తాను రాజకీయాల్లో కి రాబోతున్నానంటూ రజనీ ప్రకటించారు. అయినా ఇప్పటికీ పార్టీ విధి విధానాలు, క్రియాశీంలగా పార్టీకి సంబంధించి ఎలాంటి కదలిక లేదు. దీంతో రజనీకాంత్ ఈ సారి ఏం తేల్చబోతున్నారంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Pics from Superstar @rajinikanth‘s meet with #RMM Members #Rajinikanth pic.twitter.com/1Y1GOfO2A5
— BARaju (@baraju_SuperHit) November 30, 2020