రేడియో సిటీ వారి ఆధ్వర్యంలో జరిగిన సూపర్ సింగర్ – సీజన్ 11 గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి రాజావారు రాణిగారు చిత్ర బృందం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నటులు అడివిశేష్, కార్తికేయ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. రాజావారు రాణిగారు చిత్రంలోని మూడవ పాటని విడుదల చేసి చిత్ర బృందానికి తమ అభినందలు తెలిపారు.
లేటెస్ట్ష్ గా ‘ఎవరు’తో హిట్ సాధించిన అడవి శేష్.. ” రాజావారు రాణిగారు టీజర్ చాలా బావుంది. సినిమాకి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్లే అని విన్నాను. సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను” అని ఆయన అన్నారు. “ఒక కొత్త మూవీ టీజర్ కి రెస్పాన్స్ బాగా వస్తే అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. మా ఆరెక్స్ 100 టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ నాకింకా గుర్తుంది.
మిమ్మల్ని చూస్తుంటే అప్పట్లో మమ్మల్ని మేం చూసుకున్నట్టుంది. ఇలాగే కష్టపడితే ప్రేక్షకులు తప్పకుండా మీ చిత్రాన్ని ఆదరిస్తారు.. ట్రయిలర్ చాలా బాగుంది. సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ‘ఆర్ఎక్స్100’ హీరో కార్తికేయ అన్నారు..!!