Homeగాసిప్స్బోనీ క‌పూర్ విమ‌ర్శ‌ల‌పై జ‌క్క‌న్న మౌనం?

బోనీ క‌పూర్ విమ‌ర్శ‌ల‌పై జ‌క్క‌న్న మౌనం?

బోనీ క‌పూర్ విమ‌ర్శ‌ల‌పై జ‌క్క‌న్న మౌనం?
బోనీ క‌పూర్ విమ‌ర్శ‌ల‌పై జ‌క్క‌న్న మౌనం?

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా తొలిసారి క‌లిసి న‌టిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుందంటూ చిత్ర బృందం ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. ఎన్టీఆర్ చిన్న‌నాటి స‌న్నివేశాల‌ని చైల్ట్ ఆర్టిస్ట్‌పై చిత్రీక‌రిస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ చిత్ర రిలీజ్ డేట్‌పై బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ పెద‌వి విరిచిన విష‌యం తెలిసిందే. త‌ను నిర్మిస్తున్న `మైదాన్‌` చిత్రాన్ని అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేస్తున్న‌ట్టు తాను చాలా రోజుల క్రిత‌మే ప్ర‌క‌టించాన‌ని .. ఇది అన్యాయ‌మ‌ని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న ఆక్రోశాన్ని వెల్ల‌గ‌క్కారు. అయితే దీనిపై ఇంత వ‌ర‌కు రాజ‌మౌళి ఎలాంటి కౌంట‌ర్ ఇవ్వ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

- Advertisement -

ఇదే సంద‌ర్భంగా బోనీ క‌పూర్ `బాహుబ‌లి`లో శ్రీ‌దేవి ఎందుకు చేయ‌లేక‌పోయిందో వెల్ల‌డించ‌డం స‌రికొత్త చ‌ర్చ‌కు దారితీస్తోంది. శ్రీ‌దేవి లాంటి బిగ్ స్టార్‌కు `బాహుబ‌లి` స్క్రిప్ట్ న‌చ్చిందని, త‌ను కూడా కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చింద‌ని.. అవి చాలా గ్రేట్ అని రాజ‌మౌళి త‌న‌కు మెసేజ్ కూడా చేశాడ‌ని చెప్పుకొచ్చారు. కానీ స్టార్ లాంటి శ్రీ‌దేవిని త‌క్కువ పారితోషికానికి ఆ పాత్ర చేయ‌మ‌ని అడిగితే ఎలా చేస్తుంది. అందుకే చేయ‌లేదు. దానికి రాజ‌మౌళి పెడ‌ర్థాలు తీశారు` అని పాత సంగ‌తుల్ని ఇప్పుడు బ‌య‌టికి చెప్ప‌డం ఏంట‌ని అంతా విస్తూ పోతున్నారు. కానీ బోనీ ఎంత‌గా పాత సంగ‌తుల్ని బ‌య‌టిపెట్టినా రాజ‌మౌళి మాత్రం మౌనంగానే వుండ‌టం విశేషం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All