ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఆర్ ఆర్ ఆర్ అనే భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే . 2020 లో ఆర్ ఆర్ ఆర్ చిత్రం రిలీజ్ కానుంది కాగా తన చివరి చిత్రంగా మహాభారతం ని తెరకెక్కిస్తానని అయితే అది ఒక పార్ట్ గా కాదని స్పష్టం చేసాడు రాజమౌళి . మహాభారతం చిత్రం చేయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని అయితే దాన్ని ఇప్పుడే టచ్ చేయనని ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ నా చివరి సినిమా అవుతుందని తేల్చి చెప్పాడు జక్కన్న .
మహాభారతంని అయిదారు పార్ట్ లుగా తీయాలని భావిస్తున్నాడు జక్కన్న . అందులో అమితాబ్ బచ్చన్ , ఎన్టీఆర్ , అమీర్ ఖాన్ , రానా , ఇలా పెద్ద లిస్టే ఉంది రాజమౌళి దగ్గర . బాహుబలి తర్వాత రాజమౌళి రేంజ్ పెరిగింది దాంతో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు జక్కన్న . సినిమా నిర్మాణానికి ఎక్కువ సమయం తీసుకునే జక్కన్న ఆ స్థాయిలోనే డబ్బుల వర్షం కురిపిస్తున్నాడు .
English Title: Rajamouli last movie Mahabharatham