Homeటాప్ స్టోరీస్జక్కన్న కొత్తవాళ్లతో సినిమా తీయగలడా?

జక్కన్న కొత్తవాళ్లతో సినిమా తీయగలడా?

జక్కన్న కొత్తవాళ్లతో సినిమా తీయగలడా?
జక్కన్న కొత్తవాళ్లతో సినిమా తీయగలడా?

దర్శక ధీరుడు రాజమౌళి రేంజ్ ప్రస్తుతం టోటల్ గా డిఫరెంట్. ఇక ఎంత మాత్రం రాజమౌళిని తెలుగు దర్శకులతో పోల్చలేం. తెలుగు దర్శకులలో తన నెంబర్ ఎంత అన్నది అనవసరం. అందరూ ముక్తకంఠంతో రాజమౌళిని తెలుగులో బెస్ట్ డైరెక్టర్ అని ఎప్పుడో చెప్పేసారు. ఇప్పుడు రాజమౌళిది అంతా ప్యాన్ ఇండియా లెవెల్. దేశవ్యాప్తంగా దర్శకుడిగా తన స్థానాన్ని మెరుగుపరుచుకోవడం జరుగుతోంది. ఎందరో మేటి దర్శకులను దాటుకుని రాజమౌళి ప్రస్తుతం టాప్ రేంజ్ లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు జక్కన్న. తెలుగులో టాప్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ లను హీరోలుగా పెట్టి అతిపెద్ద మల్టీస్టారర్ ను తీస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమా 2020లో విడుదలవ్వనుంది.

ఇదిలా ఉంటే రాజమౌళి తన కెరీర్ లో ఎక్కువగా స్టార్ హీరోలతోనే పనిచేస్తూ వచ్చాడు. అయితే కథ డిమాండ్ చేసినప్పుడు సునీల్ ను హీరోగా పెట్టి మర్యాదరామన్న తీసి హిట్ కొట్టాడు, అలాగే హీరో అన్నదే లేకుండా ఈగ సినిమాను తీసి అక్కడా సూపర్ హిట్ సాధించాడు. అయితే రాజమౌళి ఇప్పటివరకూ కొత్త హీరోలతో పనిచేయలేదు. దీనికి ఇటీవలే మత్తు వదలరా టీమ్ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు దర్శక ధీరుడు. తనకు కొత్త వాళ్లతో సినిమా తీయడానికి అడ్డేమీ లేదని, కచ్చితంగా సమయం వస్తే తీస్తానని.. అయితే ఏదో కొత్తవాళ్లతో సినిమా తీసి హిట్ కొట్టాలని నేను నిరూపించుకోవాలి కాబట్టి చేయను. కథ నాకు నచ్చి, అది కొత్తవాళ్లను డిమాండ్ చేస్తే కచ్చితంగా వాళ్లతో చేస్తాను. అంతే కానీ ఏదో చేయాలి కాబట్టి చేయను అని అంటున్నాడు రాజమౌళి.

- Advertisement -

ఇక మహారభారతం గురించి కూడా స్పందించాడు. మహాభారతం తీయడం తన కల అని చెప్పిన జక్కన్న, దాన్ని కచ్చితంగా తీస్తానని, అయితే ఎప్పుడన్నది తనకు కూడా తెలియదని అన్నాడు. అలాగే మహాభారతం తీయడం జరిగితే అది ఒక్క ఎపిసోడ్ కు పరిమితం కాదని, మొత్తం మహాభారతాన్ని చెప్పడం తన లక్ష్యమని అంటున్నాడు రాజమౌళి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All