ఇటీవల యంగ్ హీరో నితిన్ తన ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా గ్రాండ్గా జరుపుకోవాలనుకున్నా కుదరకపోవడంతో చాలా సింపుల్గా అత్యంత సన్నిహితుల మధ్య నితిన్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆగస్టు 8న హీరో దగ్గుబాటి రానా వివాహం జరిగింది.
రానా మే లో తను ఓ అమ్మాయికి ప్రపోజ్ చేశానని ఫనల్గా ఆ అమ్మాయి యస్ అందని తన ప్రేమ పెళ్లి గురించి ఓపెన్గా సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల వాళ్లు ఓకే చెప్పడంతో రానా , మిహీకాల వివాహం ఆగస్టు 8న కేవలం 30 మంది మాత్రమే కుటుంబ సభ్యులు పాల్గొనగా జరిగింది.
తాజాగా మరో యంగ్ హీరో కూడా ప్రేమ పెళ్లికి రెడీ అవుతున్నాడు. ఆయనే రాజ్ తరుణ్. ఇటీవల తను నటించిన `ఒరేయ్ బుజ్జిగా` `ఆహా`లో డైరెక్ట్గా స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సందర్భంగా రాజ్ తరుణ్ స్టార్ కమెడియన్ అలీ నిర్వహిస్తున్న `అలీతో సరదాగా` టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అలీ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన రాజ్ తరుణ్ పెళ్లి విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిఖిల్కి గ్రాండ్గా వివాహం చేసుకోవాలని వుండేదని, అయితే కరోనా కారణంగా సింపుల్గా వివాహం చేసుకోవాల్సి వచ్చిందని, తను కూడా ప్రేమ వివాహమే చేసుకోబోతున్నానని, అయితే దానికి ఇంకా టైమ్ పడుతుందని స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది.