Homeన్యూస్మల్టీస్టారర్ చేయడానికి ఒప్పుకున్న యువ నటులు

మల్టీస్టారర్ చేయడానికి ఒప్పుకున్న యువ నటులు

మల్టీస్టారర్ చేయడానికి ఒప్పుకున్న యువ నటులు
మల్టీస్టారర్ చేయడానికి ఒప్పుకున్న యువ నటులు

తెలుగులో మల్టీస్టారర్లు కొత్తేమి కాదు. ముఖ్యంగా ఇద్దరు టాప్ హీరోలు కలిసి మల్టీస్టారర్ చేస్తున్నారంటే దానికొచ్చే క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. అయితే యువ నటీనటుల్లో కూడా భిన్నమైన టేస్ట్ లకు చెందిన నటులు కలిసి చేస్తుంటే ఆసక్తికరంగా అనిపించడం ఖాయం. అలాంటి కాంబినేషన్ టాలీవుడ్ లో చోటు చేసుకుంటోంది.

ఎక్కువగా చలాకీ పాత్రలతో ఫేమస్ అయ్యాడు రాజ్ తరుణ్. ఇక జార్జ్ రెడ్డి ఫేమ్ సందీప్ మాధవ్ ఎక్కువగా సీరియస్ సినిమాలు, బయోపిక్స్ లో నటించాడు. ఇలా భిన్నమైన సినిమాలు చేసే ఈ ఇద్దరూ కలిసి ఒక మల్టీస్టారర్ లో నటించబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

- Advertisement -

సుధీర్ రాజు చెప్పిన స్క్రిప్ట్ ఇరువురికీ నచ్చడంతో మరో ఆలోచన లేకుండా ఎస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎం ఆషిఫ్ జానీ ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఈ నెల 10వ తారీఖున ఈ మల్టీస్టారర్ ను లాంచ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన మిగతా వివరాలు లాంచ్ కార్యక్రమప్పుడు రివీల్ అయ్యే అవకాశముంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్నట్లు, షూటింగ్ కూడా అతి త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All