తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రాయ్ లక్ష్మి ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు తగ్గ గుర్తింపు ఏ మాత్రం రాలేదు. హద్దులు దాటి ఎక్స్పోజింగ్ చేసినా ఆమె ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. హాట్ ఐటమ్ సాంగ్స్తో ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చివరికి బాలీవుడ్లో సంచలన చిత్రం `జూలీ 2` కోసం హద్దులు దాటినా ఆ సినిమా తీవ్ర నిరాశకు గురిచేసింది.
దీంతో రియలైజ్ అయిన రాయ్లక్ష్మి ఏ ఆఫర్ వస్తే ఆ ఆఫర్ని ఎంచుకోవడం మొదలుపెట్టింది. ఆమెని హారర్ చిత్రాలే ఎక్కువడా వరిస్తుండటంతో వెబ్ సిరీస్ల వైపు అడుగులు వేస్తోంది. వెండితెరపై కెరీర్ ముగిసిన వాళ్లంతా డిజిటల్ దునియాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బాలీవుడ్లో ఇప్పటికే చాలా మంది స్టార్స్ డిజిటల్ బాట పట్టారు. నవాజుద్దీన్ సిద్ధఖీ, సైఫ్ అలీఖాన్, సొనాక్షి సిన్హా, పంకజ్ త్రిపాఠి, అంగద్ బేడీ, నియా శర్మ, శమా సికిందర్, త్రిధా చౌదరి వంటి వారంతా వెబ్ సిరీస్ బాట పట్టారు.
వారి తరహాలోనే రాయ్ లక్ష్మీ కూడా వెబ్ దునియాలోకి ఎంటరవుతోంది. ఆమె నటించిన వెబ్ సిరీస్ `పాయిజన్ 2`. అఫ్తాబ్ శివదాసాని ఇందులో హీరోగా నటించాడు. జీ5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ వెబ్ సిరీస్తో రాయ్ లక్ష్మీ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందేమో చూడాలి.