అవకాశాల పేరుతో యువ హీరోలకి వల వేయడం వారిని ఇబ్బందులకు గురిచేయడం గత కొంత కాలంగా జరుగుతోంది. ఇలాంటి సంఘటనలని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం చిత్ర పరిశ్రమలో ఉమెన్ హెరాష్మెంట్ కు పాల్పడుతున్న వారిపై పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించింది. అయినా సరే ఎక్కడో ఓ చోట అయాకులైన హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు మోసపోతూనే వున్నారు. తాజాగా మరో కొత్త హీరోయిన్ ఇలాంటి మోసంలో ఇరుక్కున్నట్టు తెలుస్తోంది.
అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ `రాహు`. సుబ్బు వేదుల రూపొందించిన ఈ చిత్రం లో కృతి గార్గ్ హీరోయిన్గా నటించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ని సొంతం చేసుకోవడంతో ఈ చిత్రంలో నటించిన కృతి గార్గ్కు వరుస ఆఫర్లు వస్తున్నాయట. తాజాగా `అర్జున్రెడ్డి` ఫేమ్ సందీప్ వంగ పేరుతో కృతి గార్గ్కి ఓ కాల్ వచ్చిందట. ప్రభాస్ సినిమా కోసం హీరోయిన్గా నటించాలని, అందు కోసం ఆడిషన్ చేయాలని కృతిని ముంబైకి రమ్మన్నారట.
ఆ కాల్ చేసింది సందీప్ వంగానే అని గుడ్డిగా నమ్మిన కృతి వెంటనే ముంబై వెళ్లిందని, సోమవారం ఉదయం నుంచి ఆమె ఫోన్ పని చేయడం లేదని, `రాహు` చిత్ర దర్శకుడు సుబ్బు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో ఏది నిజం? ఏది బద్ధం అన్నది తెలియాలంటే పోలీసులు వివరణ ఇచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.