టాలీవుడ్ లో గత ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా చిత్రం రంగస్థలం. రామ్ చరణ్ కెరీర్ లోనే కాకుండా బాహుబలి అనంతరం అత్యధిక లాభాలను అందించిన సినిమాల్లో రంగస్థలం టాప్ 5లో నిలిచింది. దాదాపు 200కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమాను ఇతర ఇండస్ట్రీలలో రీమేక్ చేయాలనీ కొంతమంది ప్లాన్ చేస్తున్నారు. ఇక కోలీవుడ్ సైడ్ లారెన్స్ కన్ను పడినట్లు తెలుస్తోంది. సినిమా తమిళ్ రీమేక్ రైట్స్ ని దక్కించుకున్నట్లు టాక్ వస్తోంది. ఇక ఆ సినిమాకు దర్శకుడు ఫిక్స్ అయినట్లు కూడా టాక్ వస్తోంది. పందెం కోడి – ఆవారా చిత్రాల దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తమిళ్ జనాలకు విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలంటే చాలా ఇష్టం. అలాగే బాలా కూడా రంగస్థలం రీమేక్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.
బాలా – లారెన్స్ కాంబినేషన్ లో గతంలోనే ఒక సినిమా రావాల్సింది. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రాకముందే క్యాన్సిల్ అయ్యింది. ఇక ఇప్పుడు లింగు స్వామి సెట్టవ్వకపోతే లారెన్స్ బాలా తోనే రంగస్థలం సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ఉన్నట్లు కోలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు లారెన్స్ బాలీవుడ్ లో కాంచన రీమేక్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. లక్ష్మి బాంబ్ టైటిల్ తో రూపొందుతున్న ఆ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు.