Homeటాప్ స్టోరీస్ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న రాధే శ్యామ్ మేకర్స్

ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న రాధే శ్యామ్ మేకర్స్


మొదటి నుండి కూడా ప్రమోషన్స్ విషయంలో రాధే శ్యామ్ మేకర్స్ మెల్లగానే ఉన్నారు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ మేకర్స్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఏదైనా పండగల వేళ మాత్రం ఓ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను శాంతింపజేస్తున్నారు. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ కు పట్టుమని రెండు వారాలు కూడా లేదు. ఈ సమయంలో కూడా రాధే శ్యామ్ టీమ్ ప్రమోషన్స్ మొదలుపెట్టకపోయేసరికి అభిమానుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది.

ఇక మార్చి 11 న రిలీజ్ చేస్తామని చెప్పారు అంతే..చెప్పడమే కానీ ఇంతవరకు మరోసారి అధికారికంగా ఆ డేట్ ను ప్రకటించడం కానీ., సినిమా తాలూకా విశేషాలు , వీడియోస్ , స్టిల్స్ రిలీజ్ చేయడం వంటివి ఏమిచేయడం లేదు. థియేట్రికల్ ట్రైలర్ రావాల్సి ఉంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి ఇతర ఇండస్ట్రీలలో ప్రత్యేకంగా ప్రెస్ ఈవెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతవరకు వీటికి సంబంధించి మేకర్స్ సైడ్ నుంచి అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దీంతో అభిమానులు సోషల్ మీడియా లో #BoycottUVCreations అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేయడం స్టార్ట్ చేసారు. ఈ క్రమంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహిచేందుకు ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

రాధే శ్యామ్ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా..ఇందులో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. 1970స్ యూరప్ బ్యాక్ డ్రాప్ లో వింటేజ్ ప్రేమకథా ఈ చిత్రం రూపొందింది. హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్య గా ప్రభాస్ నటించగా.. ప్రేరణగా పూజా హెగ్డే కనిపించనుంది. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All